హైదరాబాద నగరంలో రైల్వే ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఒక కొత్త రైల్వే టెర్మినల్ను నిర్మించడం జరిగింది. ఈ టెర్మినల్ చర్లపల్లిలో ఏర్పాటు చేయబడింది మరియు 2024 మార్చి మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించబడుతుంది.
ఈ కొత్త టెర్మినల్ నుండి 25 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ ట్రైన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగకుండా నేరుగా చర్లపల్లి నుండి బయలుదేరతాయి. దీంతో సికింద్రాబాద్ స్టేషన్లోని రద్దీ గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్లో 6 ప్లాట్ఫారమ్లు ఉంటాయి. వీటిలో 2 ప్లాట్ఫారమ్లు ఎంఎంటీఎస్లకు కేటాయించబడతాయి. ఈ టెర్మినల్ ఔటర్ రింగ్రోడ్డుకు సమీపంలో ఉండడం వలన నగరంలోని ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.
మౌలాలి నుంచి చర్లపల్లి వరకు 4 రైల్వే లైన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ లైన్ల ద్వారా ఎంఎంటీఎస్లు నడపడం ద్వారా ప్రయాణికులు నగరానికి సులభంగా చేరుకోవచ్చు.
హైదరాబాద్ వాసులకు ఇది ఒక గొప్ప వార్త!
ఈ పోస్ట్ను మీ స్నేహితులతో షేర్ చేసుకోండి!
No comments:
Post a Comment